Friday, May 24, 2024

రాజ‌శ్యామల యాగంలో సీఎం జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. విశాఖ శారదాపీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. మూడు రోజుల నుంచి శారదాపీఠంలో రాజశ్యామల యాగం జరుగుతుంది. ఈరోజు శారదాపీఠానికి వచ్చిన జగన్ పీఠంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శారదాపీఠానికి వచ్చిన జగన్ కు పీఠం నిర్వాహకులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు రాజశ్యామల యాగంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి పాల్గొన్నారు. ప్రత ఏడాది మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకూ శారద పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఐదు రోజుల పాటు శారదాపీఠం రాజశ్యామల యాగం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement