Thursday, May 2, 2024

కొండెక్కుతున్న తెల్లబంగారం ధర.. మార్కెట్‌ యార్డుకు తరలివచ్చిన పత్తి..

ఆదోని టౌన్‌, (ప్రభ న్యూస్‌): రాష్ట్రంలో రెండవ జాతీయ మార్కెట్‌ యార్డుగా పేరు ప్రఖ్యాతి గాంచిన ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రోజు రోజుకు పెరుగుతూ ధర గరిష్ట స్థాయిలో 10,711 రూపాయలు పలికి అదరగొట్టంది. ఇందుకు ప్రధాన కారణం పత్తి నిల్వలు ఉండకపోవడం, వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ సారి తెల్ల బంగారం ఉత్పత్తి దిగుబడులు తగ్గడమే ప్రధానం కారణమని రైతులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం కంటే ఉత్పత్తులు తగ్గుముఖం పట్టడంతో రోజు రోజుకు గత పది రోజుకు గత పది రోజుల నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ధరలు పెరగడంతో మార్కెట్‌ యార్డుకు తరలివస్తున్న అన్నదాతలు ముఖంలో ఆనందాలు కనబడుతున్నాయి.

మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ మహాబూబ్‌భాషా, మార్కెట్‌ యార్డు సెక్రెటరీ శ్రీకాంత్‌రెడ్డిలు మాట్లాడుతూ నాణ్యతను బట్టి పత్తి, వేరుశనగ వివిధ రకాల పంటల ఉత్పత్తులకు రేటు ధరలు ఉంటాయని రాబోయే కాలంలో ధరలు తగ్గకుండా రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాబోయే కాలంలో కూడా తమ పండించిన పంటలకు ఇటువంటి మంచి గిట్టుబాటు ధర లభిస్తే బాగుంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆదోని జాతీయ మార్కెట్‌ యార్డులో పత్తి కనిష్ట ధర 6309, గరిష్ట ధర 10,711 వేరుశనగ కనిష్ట ధర 3317, గరిష్ట ధర 6369, ఆముదం కనిష్ట 6030, గరిష్ట ధర 6208లుగా ధరలు పలికాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement