Friday, April 26, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. అయితే, ఎనికేపాడు వద్ద ఆయన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేదని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపుకు అనుమతించారు. దీంతో, ఇతర కార్లు, బైకులన్నీ అక్కడే ఆగిపోయాయి. మరోవైపు పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఏపీ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండిః ఏపీ టీడీపీకి షాక్… గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా..?

Advertisement

తాజా వార్తలు

Advertisement