Friday, March 29, 2024

ఫోటో వైరల్: పొలం పనులు చేస్తున్న రఘువీరా మనవరాలు

ఏపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అనంతపురంలోని త‌న సొంత గ్రామంలోనే ఆయ‌న చాలా కాలంగా కుటుంబ స‌భ్యుల‌తో కలసి హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆయ‌న కూడా ఓ రైతులా వ్యవసాయ పనులు చేసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలు గ‌తంలో వైర‌ల్ అయ్యాయి.

తాజాగా ర‌ఘువీరారెడ్డి త‌న మ‌న‌వరాలి క్యూట్ ఫొటోల‌ను పోస్ట్ చేశారు. ‘పల్లెటూరి పిల్ల నా మనుమరాలు సమైరా’ అంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో ర‌ఘువీరారెడ్డి మ‌న‌వ‌రాలు చీర‌క‌ట్టులో క‌న‌ప‌డుతుండ‌డం అల‌రిస్తోంది. తాత‌య్య‌ తొడ‌పై కూర్చొని ఆమె ఓ ఫొటో దిగింది. ఈ ఫోటోలు నెటిజన్‌లను ఆకట్టుకుంటున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ టీడీపీకి షాక్… గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా?

Advertisement

తాజా వార్తలు

Advertisement