Thursday, May 2, 2024

ఢిల్లీలో చంద్రబాబు అభాసుపాలైయ్యారు: విజయసాయి

టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలైయ్యారని విమర్శించారు. ‘’ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అడుగు పెట్టగానే పులి దిగింది, సింహం దిగిందంటూ అరువు నినాదాలు. పడిగాపులు కాసినా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు లేవు. మీడియా పట్టించుకోలేదు. అతని నైజం తెలియడంతో ఏ పార్టీ కూడా దరిచేరనీయలేదు. హడావుడి చేద్దామని వచ్చి అభాసుపాలై ఢిల్లీ నుంచి జారుకున్నాడు.’’ అని విజయసాయి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: మాదక ద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement