Saturday, May 11, 2024

అశోక్ గజపతిరాజు ఛీప్ ట్రిక్స్ మానుకోవాలి.. కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి

విజ‌య‌న‌గ‌రం.. నిజంగా పూలే విగ్రహానికి దండ వెయ్యాలి అనుకుంటే ముందు రోజే మాకు తెలియజేస్తే మేమే తాళం తీయస్తాం అన్నారు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి. ఇటీవల వాటర్ ఫౌంటైన్ ,సుందరికారణ చేసిన కారణంగా ఎవరు పాడుచేయకూడదు అనే తాళం వేశామ‌న్నారు. కానీ మీరు ఎటువంటి సమాచారం లేకుండా గేటుకి దండ వేసి వెళ్లిపోయారని అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఛీప్ ట్రిక్స్ మానుకోవాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీన్ని రాజకీయంగా వాడుకోవాలి అని అనుకోవడం సిగ్గుచేటన్నారు. మహనీయులు పట్ల మీకంటే మాకే గౌరవం ఎక్కువ ఉందన్నారు కోల‌గ‌ట్ల‌.మహనీయులకి మేం ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది పట్టణం అంత కనిపిస్తుందన్నారు. ఐస్ ఫ్యాక్టరీ జుంక్షన్ లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడే వైన్ షాప్ తీసేస్తాం అని చెప్పామ‌న్నారు. ఇప్పటికే వైన్ షాప్ వేరే చోటుకు మార్చేసాం అన్న సంగతి కూడా మీకు తెలియకపోవడం విడ్డురమ‌న్నారు.వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకండని మండిప‌డ్డారు. మీరు ఒక్కరే సమాజానికి మార్గదర్శకులు అయిన్నట్టు మాట్లాడవ‌ద్ద‌న్నారు.మీరు ఒక్కరే నిజాయితీ కాదు ఇక్కడ అందరం నిజాయితీ గానే సేవ చేస్తున్న విషయం గ్రహించాలన్నారు. మీ హయంలో కంటే మా హయంలోనే విజయనగరం అభివృద్ధి అయ్యింది అనే విషయం అందరికి తెలుస‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement