Thursday, May 9, 2024

ఎపి తెలుగు భాషా సంఘం ప్రాధికార సంస్థ ఇన్ ఛార్జి అధ్య‌క్షుడిగా విజ‌య‌బాబు

అమ‌రావ‌తి .. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పి విజ‌య‌బాబును “ఆంధ్ర ప్రదేశ్ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ” ఇంచార్జి అధ్యక్షుడిగా నియ‌మితుల‌య్యారు.. ఇప్ప‌టికే క్యాబినెట్ హోదాలో ఆంధ్రప్రదేశ్ అధికార బాషా సంఘం, అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయ‌న‌కు ఈ కొత్త బాధ్య‌త‌లను కూడా ఎపి ప్ర‌భుత్వం అప్ప‌గించింది.. ఈ మేర‌కు ప్ర‌భుత్వం GO.MS.12 ను విడుద‌ల చేసింది.. దీంతో ఆయ‌న నేటి నుంచే భాషాభివృద్ధి ప్రాదికార సంస్థ అధ్య‌క్షుడిగా కూడా భాద్య‌త‌లు నిర్వ‌హించనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement