Monday, April 29, 2024

Nirmal: మోడీ పథకాలను ఇంటింటికి చేరవేయడమే లక్ష్యం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి, జూన్ 29 (ప్రభ న్యూస్) : పేద ప్రజల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి చేరవేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ లో బీజేపీ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, జిల్లా బీజేపీ నేతలు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

కరోనా సమయంలో వ్యాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం ఇలాంటి అనేక విషయాలను మోడీ ప్రవేశపెడుతున్నారని ప్రజలకు తెలిపారు. కుటుంబ పాలన అంతమొందించాలంటే భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అంతకుముందు తొలి ఏకాదశిని పురస్కరించుకొని బంగాల్ పేట్ గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement