Tuesday, May 7, 2024

వెంగమాంబ ఆలయం లో వెంకయ్య నాయుడు దంపతుల పూజలు

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసిన శ్రీ వెంగమాంబ తల్లిని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉషమ్మ దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు వెంకయ్య నాయుడు దంపతుల కు ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు

అలాగే ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఆలయ వ్యవస్థాప ధర్మకర్త పచ్చవ కరుణాకర్ మేళతాళాలతో స్వాగతం పలికి అదేవిధంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, కావలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చంచల బాబు యాదవ్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పెండ్యాల సూర్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ చండ్ర మధుసూదన్ రావు, కర్ణాటక ఫిలిం మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు గంగవరపు సుబ్బారావు తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement