Thursday, May 9, 2024

Golden Memories – ఆత్మీయ మిత్రులను కలవడం సంతోషకరం – మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

దుత్తలూరు, జూన్ 11(ప్రభ న్యూస్) ఉదయగిరి నియోజకవర్గంలో తనకుఆత్మీయ మిత్రులు ఉన్నారని ఈ రోజు అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.ఆయన దుత్తలూరు లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం ఉదయగిరి నుండి డిల్లీ వరకు సాగిందని తెలిపారు.ఉదయగిరి నియోజక వర్గ ప్రజల ఆధరణతోనే నేను డిల్లీ వరకు ఎదిగానని తెలిపారు.ఉదయగిరి ప్రజలు చందాలు ఇచ్చి నాకు రాజకీయ అభివృద్ధికి దోహద పడ్డారని తెలిపారు.రెండు దఫాలు ఎమ్మెల్యే గా గెలిపించారని తెలిపారు

.ఉదయగిరి నియోజక వర్గంలో తనకు బాల్య మిత్రులు ఉన్నారని వారి సహకారం మరువలేనిది అన్ని కొనియాడారు.నాకు ఎపిలగుంటకు చెందిన లక్ష్మి నరసయ్య, నందిపాడు పావులూరి వెంకట రామయ్య,నర్రవాడ తుమ్మల వెంగయ్య చాలా మంది మిత్రులు ఉన్నారని పేరు పేరున పలకరించారు. ఉదయగిరి నియోజక వర్గ ప్రజలు చేసిన మేలు మరువలేనని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్ర శేఖర రెడ్డి,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి,ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు,కంభం విజయ రామిరెడ్డి,టీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన.చెంచల బాబు యాదవ్,జిల్లా బిజేపి అధ్యక్షులు గుండు పల్లి భారత్ కుమార్ యాదవ్ ,బిజేపి నాయకులు కర్నాటి రోశయ్య,మాజీ ఎంపిపి శ్రీకుర్తి.రవీంద్ర బాబు,మాజీ జడ్పీటిసి లు పాముల సుబ్బరాయుడు,మల్లికార్జున,అన్ని మండలాల బిజేపి,టీడీపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement