Friday, April 26, 2024

పుకార్లకు చెక్ పెట్టిన వంగవీటి రాధ..

పీలేరు, (రాయలసీమ ప్రభవెబ్ ప్రతినిధి) : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లకు తెలుగు దేశం నాయకుడు వంగవీటి రాధా చెక్ పెట్టారు. ఇటీవల ఆయన జనసేన పార్టీ లో చేరాబోతున్నారనే ప్రచారం ఊపండుకున్న నేపథ్యంలో మంగళవారం ఆయన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి లో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో పాల్గొన్నారు. పాదయాత్ర కు సంఘీభావం తెలియచేసిన రాధా లోకేష్ తో కొంత దూరం కలిసి నడిచారు.

లోకేష్ ను బస వద్ద కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా తాను పార్టీ మారడం లేదని చాటి చెప్పారు.. ఈ సందర్బంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ లు చల్లా బాబు, నల్లారి కిషన్ కుమార్ రెడ్డి తదితర నేతలు లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement