Wednesday, May 1, 2024

భువనేశ్వరికి సారీ చెప్పిన వంశీ.. ఆ మాట అనాల్సి ఉండకూదు..

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరికి సారీ చెబుతున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే వల్లభనేని వంశి. ‘‘నా వల్ల తప్పు జరిగింది. ఆ మాట అనాల్సింది కాదు. ఏదో మాట్లాడబోయి ఇంకేదో నోటి నుంచి వచ్చింది. నాకు భువనేశ్వరి అక్కతో సమానం. ఎమోషనల్​గా ఓ పదం దొర్లింది. అందుకే క్షమాపణ చెబుతున్నా.. ఈ మాటతో బాధపడ్డ ప్రతి ఒక్కరినీ క్షమించాలని అడుగుతున్నా’’ అని వివరణ ఇచ్చారు వంశీ. టీడీపీలో అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరేనని అన్నారు. ఓ మీడియాలో జరిగిన డిబేట్​లో తను ఈ విధంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement