Saturday, April 20, 2024

హ‌మాలీగా మాజీ ఐపీఎస్ .. రూ. వంద సంపాదించాన‌ని ట్వీట్ ..

హ‌మాలీ అవ‌తార‌మెత్తారు మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్..ఆయ‌న‌కి అంత అవ‌స‌రం ఏం వ‌చ్చింద‌నుకుంటున్నారా..ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను తెలుసుకునేందుకు ఆయ‌న ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా న‌ల్గొండ జిల్లా నార్క‌ట్ ప‌ల్లి వ‌ద్ద ఉన్న కొనుగోలు కేంద్రాల‌ను ప్ర‌వీణ్ కుమార్ సంద‌ర్శించారు. ఈ మేర‌కు లారీల్లోకి బస్తాలను ఎక్కిస్తున్న హమాలీలతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన కూడా ఓ హమాలీగా అవతారమెత్తారు. హమాలీలతో కలిసి ధాన్యం బస్తాలను మోశారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ చేశారు. ‘ఈరోజు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వరి కల్లంలో హమాలీ పని చేసి ₹100/- సంపాదించాను. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్..అని ఆయన ట్వీట్ చేశారు. ఆయ‌న బ‌స్తాలు మోసిన ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement