Sunday, April 28, 2024

Undi – టిడిపిలో ర‌ఘ‌రామ ర‌చ్చ – చంద్రబాబును అడ్డుకున్న రామరాజు వర్గీయుల

ఆంధ్రప్రభ , ఏలూరు బ్యూరో : పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్లాట రచ్చరచ్చగా మారింది. నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజుకు తెలుగుదేశంలో టిక్కెట్టు ఇచ్చే విషయం … కడకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడినే బయటకు రానీయకుండా పార్టీ శ్రేణులు అడ్డకున్నాయి. ఈ ఘటన తెలుగుదేశం పార్టీలో ఆందోళనకు దారి తీసింది. నర్సాపురం ఎంపీ సీటు ఇవ్వటానికి బీజేపీ తిరస్కరించటంతో రామకృష్ణం రాజుకు తమ పార్టీలో చోటు కల్పించాలని ఆలోచించారు. శుక్రవారం పాలకొల్లులో జరిగిన సభలో రామకృష్ణం రాజు టీడీపీలో చేరారు. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో రామరాజు, శివరామ రాజు మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరినీ పక్కన పెట్టి ఉండి నియోజకవర్గం నుంచి రఘు రామ కృష్ణం రాజును బరిలో దింపేందుకు చంద్రబాబు నాయుడు అంతర్గత సమావేశంలో చర్చించారు.

అంతే రామరాజువర్గీయులు ఆందోళనకు దిగారు. ఉండి టీడీపీ శ్రేణులు తీవ్ర వాగ్వాదంతో పేచీకి దిగటంతో.. నేతలతో సమావేశం అనంతరం హెలిప్యాడ్ వద్దకు వెళ్ళేందుకు చంద్రబాబు సిధ్ధమయ్యారు. చంద్రబాబు బయటకు రాకముందే హాలు వద్ద రామరాజు వర్గీయులు బైటాయించారు. ఉండి గడ్డ రామరాజు అడ్డా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యేలు నిమ్మల, రామరాజు, మాజీ మంత్రి పితాని, అభ్యర్థులు, కీలక నేతలతోపాటు తెలుగుదేశం లో చేరిన రఘురామ కృష్ణం రాజు పాల్గొన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement