Sunday, April 28, 2024

Andhra Pradesh – మ‌నిషిగా పుడితే విజ్ఞ‌త‌, విచ‌క్ష‌ణ ఉండాలిగా …. షర్మిల‌పై అవినాష్ ఆగ్ర‌హం

ష‌ర్మిల వ్యాఖ్యాల‌పై స్పందించిన అవినాష్ రెడ్డి
ఆమె వ్యాఖ్యాలు విన‌డానికే భ‌య‌కరంగా ఉన్నాయి
తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు..
బూడిద చ‌ల్లి తుడుచుకోమంటున్నారు
మాట్లాడే వారిది మనిషి పుట్టుకేనా…

కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందిస్తూ, మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని, అదే మంచిదని వ్యాఖ్యానించారాయన. పులివెందుల‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నాన‌ని అన్నారు. . ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయ‌ని చెప్పారు. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటార‌ని,. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటార‌ని ష‌ర్మిల‌ను ఉద్దేశించి అన్నారు. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకోవ‌చ్చ‌ని, కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాల‌న్నారు. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా అని అవినాష్‌రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement