Monday, April 29, 2024

Rajahmundry – జ‌గ‌న్ పాల‌న అంతా అవినీతిమ‌య‌మే… పురందేశ్వ‌రి

కేంద్ర నిధులు సైతం దుర్వ‌నియోగం
పేద‌ల ఇళ్ల‌ను మింగేశారు
మ‌డ అడ‌వుల‌ను వ‌ద‌ల‌లేదు
రాజ‌మండ్రి ప‌రిధిలో అన్ని సీట్లు గెల‌వాల్సిందే ..
బిజెపి ఎపి చీఫ్ పురందేశ్వ‌రి

రాజ‌మండ్రి – జ‌గ‌న్ పాల‌న అంతా అవినీతిమ‌య‌మ‌ని ఆరోపించారు బిజెపి ఎపి అధ్య‌క్షురాలు, రాజ‌మండ్రి లోక్ స‌భ అభ్య‌ర్ధి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. రాజమండ్రిలో బీజేపీ కార్యాలయంను రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, పరిశీలకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా, 22 లక్షలు ఇళ్ళు కేంద్ర మంజూరు చేస్తే మూడున్నర లక్షలు మాత్రమే నిర్మించారని ఆమె పేర్కొన్నారు. జగన్ కాలనీల్లో అవినీతి ఉందన్నారు. ల్యాండ్ లెవెలింగ్ చేయటానికి కూడా నిధులు దోచేశారని, మడ అడవులు అడవుల్లో జగనన్న కాలనీల నిర్మాణం ఎలా జరిపారన్నారు.

- Advertisement -

అన్ని స్థానాలు గెల‌వాల్సిందే ..
పార్లమెంట్ పరిధిలో ఏడుగురు అభ్యర్థులను గెలిపించుకోవాలని పురందేశ్వరి కార్య‌కర్త‌ల‌కు పిలుపు ఇచ్చారు. కాకినాడ , రాజమండ్రి కలిపేస్తామని ఇక్కడి నాయకులు అలవిగాని వాగ్దానాలు చేస్తున్నార‌ని, వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోఆరు. , రాజమండ్రి పార్లమెంటు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. రాజ‌మండ్రి లోక్ స‌భ పరిధిలో ఉన్న ఇద్దరు జనసేన అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులతో కలిపి పని చేస్తానని అన్నారు.., రాజమండ్రిలో కేంద్ర నిధులతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందన్నారు. నందమూరి తారక రామారావు బిడ్డగా మీ ముందుకు వచ్చానని , త‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement