Monday, April 29, 2024

విశాఖలో మహా సంప్రోక్షణ.. సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం

శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు కలిశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం వైయస్‌.జగన్‌ను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలు అందించారు వేద పండితులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement