Sunday, May 19, 2024

TTD | 23 నుంచి కార్తీకమాస విష్ణుపూజలు

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి : లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీకమాసంలో తిరుమల వసంతమండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పూజలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు విష్ణుసాలగ్రామ పూజ, 24 న శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు కైశికద్వాదశి శ్రీతులసి దామోదర పూజ, 29 న బుధవారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు గో పూజ, డిసెంబర్‌ 10 న ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు ధన్వంతరి జయంతి జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement