Sunday, May 5, 2024

సీనియర్‌ ఐపీఎస్‌లకు స్థానచలనం.. హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా హరీష్‌కుమార్‌, రైల్వే ఏడీజీగా విశ్వజిత్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నూతన నియామకం జరిగింది. ప్రస్తుతం రైల్వే డీజీగా ఉన్న హరీష్‌కుమార్‌ గుప్తాను హోంశాఖ ప్రిని ్సపల్‌ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిప ల్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న కుమార్‌ విశ్వజిత్‌ను రైల్వే అడిషనల్‌ డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది.

ఈమేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పునర్వ్యవస్ధీకరణ లో భాగంగా కొత్త జిల్లాలకు ఎస్పీల నియామకం జరుపుతూ తొలిదశలో ప్రభ ుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. రెండోదశలో భాగంగా మంగళవారమే ఉన్నతస్ధాయిలో 15మంది సీనియర్‌ ఐపీఎస్‌లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కీలకమైన పోస్టుల్లో ఇధ్దరు సీనియర్లకు స్ధానచలనం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement