Thursday, April 25, 2024

రైలు ప్రమాదంలో మహిళ మృతి.. ఆత్మ‌హ‌త్యానా, యాక్సిడెంటా?

ఖైరతాబాద్ (ప్రభన్యూస్) : హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళ చ‌నిపోయింది. సోలాపూర్ కు చెందిన తుమ్మ లావణ్య గణేష్ (36)గా మృతురాలిని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇటీవలే భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ట్రేస్ పాస్ ఏరియాలో నిలబడి ఉండగా రైలు వెళుతున్న విషయాన్ని గమనించకపోవడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

రైలుకు దగ్గరగా ఉండడం రైలు గాలికి కింద పడడంతో తలకు తీవ్రమైన గాయాలై చ‌నిపోయింది. డెడ్ బాడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి తరలించారు. మృతురాలి తండ్రి సాధన కాలేజీలో వ‌చ్‌మ‌న్‌గా పనిచేస్తున్నాడు. కాగా, దీనికి సంబంధించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు జి ఆర్ పి పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement