Saturday, April 27, 2024

Tirupathi: జోరు వర్షంలోనూ డిప్యూటీ మేయర్ పర్యటన..

తిరుపతి సిటీ ప్రభ న్యూస్: తిరుపతి నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది, అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాల కారణంగా తుమ్మలగుంట, సాయి నగర్, అవిలాల గ్రామ పంచాయతీల నుంచి వచ్చే వర్షపు నీరుతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాఘవేంద్ర నగర్, కేశవయ్య గుంట, లక్ష్మీపురం కూడళ్ళలోని కాలువల్లో చెత్త పేరుకుపోయింది. ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు, చెత్తను తొలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, సానిటరీ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement