Friday, May 3, 2024

Tirumala – శ్రీవారి ఆలయంలో నేటి నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల – పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం ముగియడంతో సోమవారం ఉద‌యం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది. గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజామున నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, నేటి నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement