Tuesday, May 7, 2024

Breaking: విజ‌య‌న‌గ‌రం, మ‌న్యం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు, పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. విజ‌య‌న‌గ‌రం, మ‌న్యం జిల్లాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉరుములు, మెరుపుల‌తో ఆకాశం అత‌లాకుత‌లం అవుతోంది. ప‌లుచోట్ల పిడుగులు ప‌డ్డాయి. పిడుగుపాటుకు కురుపాం మండ‌లంలో ఇద్ద‌రు, డెంకాడ‌లో మ‌రొక‌రు చ‌నిపోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇవ్వాల, రేప‌ట్లోగా తెలంగాణ‌కు రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌నున్న‌ట్టు వాతావర‌ణ శాఖ చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement