Sunday, April 28, 2024

bhimavaram: ముగ్గురు మృతి.. రైల్వే ట్రాక్ పై ఇద్దరు.. చికిత్స పొందుతూ ఒకరు..

భీమవరం (ప్రభన్యూస్ ప్రతినిధి) : భీమవరంలోని టౌన్ రైల్వే స్టేషన్ పట్టాలకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి శేషాద్రి ఎక్స్ ప్రెస్ స్టేషన్ వైపు దిక్కుకుండ పట్టణ వైపు దిగుతుండగా పొరపాటున కాలు జారి పడిపోవడంతో మృతిచెందగా, మరో వ్యక్తి ఉండి రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై మృతిచెందాడు. ఇతను ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

మూడో ప్రమాదం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని గరగపర్రు రోడ్డులోని రైల్వే గేటు దాటుతుండగా ఓ వ్యక్తిని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. అతన్ని స్థానికులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ మృతి చెందిన వ్యక్తి భీమవరంలోని లంకపేటకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాల సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాద స్థలాలను పరిశీలించిన డీఎస్పీ శ్రీనాథ్..

- Advertisement -

భీమవరం వన్ టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదాల్లో మృతిచెందిన మృతదేహాలను భీమవరం డీఎస్పీ బండారు శ్రీనాథ్ ఇవాళ పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను, ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు వన్ టౌన్ రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ కాలుజారి మృతిచెందిన వ్యక్తి వివరాలను, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement