Thursday, May 9, 2024

Kishan Reddy : అగ్ని ప్ర‌మాదంపై స్పందించిన కిష‌న్‌రెడ్డి… ప్ర‌భుత్వం ఫైర్

నాంప‌ల్లిలో అగ్నిప్ర‌మాదంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి స్పందించారు. నాంపల్లిలోని బజార్ ఘాట్ అగ్ని ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఇది చాలా దురదృష్టకరం అన్నారు. ప్రజలు నివసించే ప్రదేశాల్లో ప్రమాదకర గోడౌన్లు ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు.

కెమికల్ గోడౌన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. అత్యంత జనాభా నివసించే ప్రాంతంలో, రెసిడెన్షియల్ ఏరియాలో ఈ గోడౌన్ ఉండగా… దీపావళి బాణసంచా నిప్పురవ్వలు పడి.. అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు. ఈ గోడౌన్ లేకపోయి ఉంటే, ఇది జరిగేది కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement