Monday, April 29, 2024

మూడోరోజూ… టీడీపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ కొనసాగుతోంది. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాల్లో తమకు చర్చకు అవకాశమివ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. రైతుల సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని, రైతు ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేస్తూ పోడియంను ముట్టడించారు. దీంతో ప్రశ్నోత్తరాలు జరుగకుండా ఆటంకం కలుగుతుండడంతో సభ్యుల సస్పెన్షన్‌కు రాష్ట్రవ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సిఫార్సు చేశారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement