Monday, April 29, 2024

ఒంగోలులో దొంగల బీభత్సం.. అర్ధరాత్రి బీరువా పగులగొట్టి దొంగతనం

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పెర్ణమిట్టలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో వాళ్ళు పెళ్లికి వెళ్లిన విషయాన్ని పసిగట్టిన దొంగలు.. ఇంట్లోకి ప్రవేశించి రూ.4.50 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పెర్ణమిట్టలో నివాసం ఉండే కందుకూరి బాబు కుటుంబం వివాహ శుభకార్యం నిమిత్తం శుక్రవారం రాత్రి అందరూ వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఇంటిలో బీరువాను పగులగొట్టి అందులో ఉన్న నాలుగున్నర లక్షల డబ్బులు, 38 సవర్ల బంగారం దోచుకొని వెళ్లి పోయారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు తాలూకా పోలీసులు చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement