Saturday, April 27, 2024

చంద్రబాబు హయాంలో పరిశ్రమల్లో ఉద్యోగాలు సున్నా.. మంత్రి కాకాణి

ముత్తుకూరు, ఏప్రిల్ 25( ప్రభ న్యూస్) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఊసేలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మండలంలోని పైనం పురం గ్రామపంచాయతీలో రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ కావలి విజయ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. మంత్రికి సర్పంచ్ అనుచరులు ఘనంగా స్వాగతం పలికారు. మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ సుగుణ, మాజీ జెడ్పిటిసి నెల్లూరు శివప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతమైన తీర ప్రాంతం నందు పరిశ్రమల స్థాపనలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే కేసులు పెట్టేవారని మంత్రి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎవరు పోరాటం చేసినా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు పరిపాలన దోపిడీ పరిపాలనని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement