Saturday, April 27, 2024

తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన ప్ర‌మాదం

తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పిన ఘ‌ట‌న ఏపీలో చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్‌ వద్ద కొంత మంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లు పెట్టారు. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచి వెళ్లడంతో రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు రావడంతో అమరావతి ఎక్స్‌ప్రెస్‌ గంటపాటు నిలిచిపోయింది. మరో ఇంజిన్‌ జోడించిన తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ‌క‌పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement