Sunday, May 12, 2024

తండ్రిని హ‌త్య చేసిన కుమారుడు

ఓ కుమారుడు త‌న తండ్రినే హ‌త‌మార్చిన ఘ‌ట‌న ఏపీలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంతో.. స్నేహితుల సహకారంతో కన్నతండ్రిని హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సఖినేటిపల్లి మండలం వి.వి. మెరకలో కన్నతండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాలతో తండ్రి శేఖర్ (55)ను తనయుడు శరత్ హత్య చేశాడు. స్నేహితుల సహకారంతో తండ్రిని తీవ్రంగా కొట్టాడు. అనంతరం గాయపడిన శేఖర్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement