Friday, May 17, 2024

మ‌రోసారి ఆసుప‌త్రిలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమారై ఐశ్వ‌ర్య‌

మ‌రోసారి ఆసుప‌త్రి పాల‌య్యారు త‌మిళ సూపర్ స్టార్ కుమారై ఐశ్వ‌ర్య‌. ఫిబ్ర‌వ‌రి 1న క‌రోనా సోక‌డంతో హైద‌రాబాద్ లోని ఓ హాస్ప‌ట‌ల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంత‌రం కోలుకోవ‌డంతో ఆమె డిశ్చార్జ్ అయ్యారు. కాగా ముసాఫిర్ అనే మ్యూజిక్ వీడియో షూటింగ్ పనుల్లో బిజీగా ఉండిపోయారు. కరోనాకు ముందు.. కరోనా తర్వాత జీవితం. అధిక జ్వరం, తల తిరగడం లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరాను’’ అంటూ ఐశ్వర్య ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. పక్కన డాక్టర్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఎంతో స్ఫూర్తి నీయమైన, గొప్ప మహిళా డాక్టర్ ప్రీతికా చారిని కలవడం, ఆమె తనకు సమయం వెచ్చించడం గర్వంగా ఉందని పోస్ట్ లో పేర్కొన్నారు. మిమ్మల్ని కలుసుకోవడం ద్వారా మహిళా దినోత్సవాన్ని ప్రారంభించడం గొప్పగా ఉంది. ఇది నాకు గర్వకారణం’’ అని ప్రకటించారు. పోస్ట్ కోవిడ్ అనారోగ్యంతో మరోసారి సోమవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement