Saturday, May 18, 2024

AP | ‘ప్రజాగళం’ రెండో విడత షెడ్యూల్‌ ఖరారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘‘ప్రజాగళం’’ రెండో విడత పర్యటనల షెడ్యూల్ ఖరారైంది. రేపటి (బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రాపురం, 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్‌షోలో పాల్గొంటారు. 5న నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మొదటి సమావేశం, సాయంత్రం 6 గంటలకు రెండో సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోలలో చంద్రబాబు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement