Tuesday, May 7, 2024

జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి : ఉప్పాల హారిక

జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం హారిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాము దంపతులు మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన చైర్మన్ దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కుబడులు చెల్లించారు. శ్రీ స్వామి వారిని దర్శించుకోగా, ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ లీలాకుమార్ వారికి స్వామి వారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందజేసి, ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం హారిక విలేకర్లతో మాట్లాడుతూ… స్వామి వారిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. దివిసీమ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement