Monday, April 29, 2024

AP | కుప్పంలో పాముల సంచారం.. భయందోళనలో పట్టణ ప్రజలు

కుప్పం, (ప్రభ న్యూస్): ఏపీలోని కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఈ మధ్య కాలంలో పాములు విపరీతంగా ఇండ్ల మధ్య సంచారిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల వార్డుల ల్లో పాముల సంచారం ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు అంతా ఆందోళన చెందడం లేదు. పట్టణ వార్డుల్లో పాములు అక్కడ చుసిన కనిపిస్తుండడం తో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 17వార్డులో ని రచ్చ వద్ద ఏకంగా కొండ చిలువ ప్రత్యక్షం కావడం తో ప్రజలు పరుగులు తిశారు.

- Advertisement -

పట్టణంలోని మురికి నీటి కాలువలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం, చెత్త దిబ్బల వద్ద అధికంగా నిల్వ ఉండడం, ఖాళీ స్దలాలు వద్ద ఎపుగా మొక్కలు మొలవడం, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న 17,13వ వార్డులో అధికంగా పాములు సంచారిస్తున్నాయి. ప్రజలు పాములు కనబడగానే వెంటనే కౌన్సలర్ తెలియజేసి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు మునిసిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొనే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement