Friday, April 26, 2024

పసికందును హతమార్చిన తల్లి.. చాక‌చ‌క్యంగా కేసును ఛేదించిన మహిళా పోలీసులు

ఒంగోలు క్రైమ్ (ప్రభ న్యూస్) : అప్పుడే పుట్టిన పసికందును కళ్లు తెరిచీ తెరవక ముందే ఓ కన్నతల్లి హతమార్చింది. ఏపీలోని ప్ర‌కాశం జిల్లా గిద్దలూరు మండలం సంజివరాయునిపేటలో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ అమానవీయ ఘటనను పోలీసులు ఛేదించారు. దీనికి వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలోనే ఇట్లా చేశార‌ని క‌నుగొన్నారు. ఓ అవివాహిత ఈ ప‌నిచేసిన‌ట్టు గుర్తించారు పోలీసులు. గతనెల 30న నమోదైన ఈ కేసును జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఆదేశాల మేరకు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్ఐ బ్రహ్మ‌నాయుడు సంయుక్తంగా దర్యాప్తు జరిపారు. కేసులో గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు చుట్టు పక్కల గ్రామాలలో గ‌ర్భిణులు, బాలింతల వివరాలను సేకరించారు.

దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఓ అవివాహిత యువతి గ్రామానికి వచ్చి వెళ్లినట్లు గుర్తించి ఆ సమాచారాన్ని అధికారులకు తెలియచేశారు. సదరు యువతిపై అనుమానంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పసిబిడ్డను చంపిన ముద్దాయిని గుర్తించారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడంలో విశేష కృషి చేసిన గిద్దలూరు మహిళా పోలీస్ లు అశ్వని, వనితశ్రీ, కవిత, పావని, రాధను ఎస్పీ మాలిక గార్గ్ అభినందించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందచేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement