Friday, April 26, 2024

అంబులెన్స్ ను ఢీకొన్న లారీ..

తెనాలి,మే29(ప్రభ న్యూస్):తెనాలి మండలం, పెదరావూరు గ్రామం భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం అంబులెన్స్ ను లారీ ఢీకొన్న ఘటనలో అంబులెన్స్ లో పేషెంట్ తో పాటు డ్రైవర్, నర్స్ కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మరొక అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement