Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మ‌రొకరికి తీవ్ర గాయాలు..

తెనాలి, ప్రభన్యూస్ : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన తెనాలి మండలం ఆటో నగర్ సమీపంలో జరిగింది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, రాణి గారి తోట కు చెందిన అఖిల్ (16),విశ్వనాధ్ (17) లు శనివారం మధ్యాహ్నం విజయవాడ నుంచి తెనాలి వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీ కొని అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందాడు మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement