Monday, May 6, 2024

Exclusive | కాపలాగా ఉన్న రైతును చంపేసి.. టమాటాలను దోచుకెళ్లారు!

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. టమాటాకు కాపలాగా ఉన్న రైతును చంపేసి టమాటాను ఎత్తుకెళ్లిన ఘటన ఇవ్వాల (సోమవారం) వెలుగులోకి వచ్చింది. వారం రోజుల్లో ఇది రెండో ఘటనగా తెలుస్తోంది. వారం క్రితం ఇదే జిల్లాలోని బోడుమల్లదిన్నె గ్రామంలో టమాటాల కోసం రైతు నరేం రాజశేఖరరెడ్డిని చంపేశారు. ఆదివారం రాత్రి పెద్దతిప్పసముద్రం గ్రామానికి చెందిన మధుకరరెడ్డి అనే రైతును గుర్తు తెలియని దుండగులు చంపేసి, టమాటాలు తీసుకెళ్లారు.

టమాటా ధర భారీగా పెరగడం ఒకవైపు రైతులకు లాభాలు తెస్తుంటే.. మరోవైపు వారి ప్రాణాలమీదకు వస్తుందని చాలామంది అంటున్నారు. ధరలు పెరగడంతో రైతులు పంటలకు కాపాడుకునేందుకు పొలం వద్దే ఉంటున్నారు. చాలామంది రైతులు రాత్రుళ్లు కూడా అక్కడే నిద్రిస్తున్నారు. టమాటా పంటకు కాపలాగా ఉన్న మధుకరరెడ్డిని ఆదివారం రాత్రి దుండగులు హత్య చేశారు. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement