Monday, May 6, 2024

అంబేద్కర్‌ కోనసీమ పేరే ఖరారు.. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై కేబినెట్​ నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ : కోనసీమ జిల్లాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ, మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు బిల్లుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సచివాయలంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అలాగే కొత్తగా ఏర్పాటు- చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీసీ జీవోలో చేసిన మార్పులకు సంబంధించి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ-లు, కార్పొరేషన్‌, సొసైటీ- ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపుజేస్తూ గతంలో మంత్రుల కమిటీ- చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 70 యేళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ జూలై 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదని, పెన్షనర్‌ లేదా ఫ్యామిలీ పెన్షనర్‌ మరణిస్తే అంతిమసంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ- చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement