Thursday, April 25, 2024

ఆ త‌ల్లి వారికి భార‌మైంది : బ‌స్టాండ్ లో చ‌నిపోయింది

ఆ తల్లి క‌న్న‌వారికి భారమైపోయింది.. బస్టాండులో వదిలేసి వెళ్లిపోయారు.. చలిని తట్టుకోలేక ప్రాణం విడిచింది. ఈఘ‌ట‌న తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప‌రిధిలో జ‌రిగింది. సుమారు వందేళ్ల వయస్సుండే వృద్దురాలు కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలో బుర్రిలంక సుబ్బారాయుడు గుడి ప్రక్కనున్న బస్టాండులో సోమవారం ఉదయం మృతి చెంది ఉంది.ఆదివారం ఉదయం ఎవరో అటోలో తీసుకొచ్చి ఈవిడను జాతీయ రహదారి ప్రక్కనున్న ఈ బస్టాండులో పడుకోపెట్టి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే చలి తీవ్రంగా ఉండటంతో సోమవారం ఉదయం మృతి చెందినట్లు తెలుస్తుంది.. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు అనాధ శవంగా పరిగణించి గ్రామ పంచాయతీ ద్వారా అంత్య‌క్రియలకు చర్యలు చేపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement