Monday, May 6, 2024

Hamsa Nandini: టాలీవుడ్ నటి హంస నందినికి క్యాన్సర్

టాలీవుడ్ ప్రముఖ సినీనటి హంస నందిని సంచలన విషయాన్ని బయటపెట్టింది. తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని తెలిపింది.  ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భయం, ప్రతికూల భావాలతో జీవించను అని హంస నందని అన్నారు. ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందడుగు వేయాలనుకుంటున్నా అని తెలిపారు.

”నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను. పరీక్షల అనంతరం నాకు రొమ్ము క్యాన్సర్‌ గ్రేడ్‌-3 దశలో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని భావించాను. కానీ, జన్యుపరమైన క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాని ప్రకారం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 70శాతం లేదా గర్భాశయ క్యాన్సర్‌ బయటపడే అవకాశం 40 శాతం ఉంది. ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే దారి. ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నాను. మరో ఏడు చేయించుకోవాల్సి ఉంది. ఈ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదు. నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో మరలా మీ ముందుకువస్తా” అని హంస నందిని పేర్కొంది.

కాగా, హంస నందిని గతంలో పలు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా నటిస్తూనే మిర్చి, అత్తారింటికి దారేది’ వంటి చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసి హంస నందిని తెలుగువారికి చేరువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement