Saturday, April 20, 2024

ఫ్రెండ్ భార్యతో ఎఫైర్‌.. అస‌లు విష‌యం తెలియ‌డంతో…

ఫ్రెండ్‌షిప్‌ ముసుగులో ఓ వ్య‌క్తి త‌న అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. ఫ్రెండ్ భార్యతోనే ఎఫైర్ పెట్టుకుని దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. అనంతపురం రూరల్ మండలం నందమూరి నగర్ కు చెందిన నల్లబోతుల రాజేష్ కు సుజాత అనే మహిళతో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. రాజేష్ కు స్థానికంగా ఉండే మరో కాలనీలో గురుమూర్తి అనే స్నేహితుడున్నాడు. ఇటీవల గురుమూర్తి కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ పనులన్నీ రాజేష్ దగ్గరుండి చేయించాడు.

ఈ క్రమంలో గురుమూర్తి భార్యతో రాజేష్ కు చనువు ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. స్నేహితుడే కదా నమ్మకంగా ఉంటాడని భావించిన గురుమూర్తికి రాజేశ్ విషయం తెలిసి షాక్ తిన్నాడు. వెంటనే ఇది తప్పని హెచ్చరించాడు. తీరు మార్చుకోవాలని చెప్పాడు. కానీ, రాజేష్ త‌న తీరు మార్చుకోక‌పోవ‌డంతో అతడిని హతం చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో మందు పార్టీ చేసుకుందాం రావాలని రాజేష్ ను ఆహ్వానించిన గురుమూర్తి ప్లాన్ ప్రకారం కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement