Monday, April 29, 2024

Indrakeeladri : జగన్మాత సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై…

ఎన్టీఆర్, ప్రభ న్యూస్, బ్యూరో : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న జగన్మాత సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా.. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో భ్రమరాంబ ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారి సేవలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనము చేయగా.. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి భ్రమరాంబ అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు అందజేసినారు. ఈ కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement