Monday, April 29, 2024

AP: హార్ట్ అటాక్ తో వ్యక్తి మృతి…

చీరాల : స్థానికంగా ఓ హోటల్లో టీ మాస్టర్ గా పని చేసే పసుపులేటి వేణు (45) హఠాత్తుగా గుండె పోటుతో మృతిచెందాడు. కొత్తపేట గ్రామానికి చెందిన వేణు గడియార స్థంభం సెంటర్ లోని హోటల్లో టీ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.

మద్యం సేవించి గడియార స్థంభం సెంటర్ లోని ఓ బార్బర్ షాప్ కు వచ్చి కుర్చీలో కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్ఐ అహ్మద్ జానీ సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి గురించి వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement