Tuesday, April 30, 2024

ఢిల్లీలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీ..

న్యూఢిల్లీ : టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అయితే కాసేప‌టి క్రితం చంద్ర‌బాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వ‌హించారు. విభజన హామీల కోసం టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతోన్నట్లు సమాచారం. వైసీపీ గత వ్యూహాన్ని టీడీపీ అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ పార్లమెంట్ పార్టీ భేటీకి ముందు చంద్రబాబును ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement