Thursday, April 18, 2024

కర్నూలులో హైకోర్టుకు సినీ పరిశ్రమ మద్దతివ్వాలి : మంత్రి జయరాం

క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సినీ ప‌రిశ్ర‌మ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. క‌ర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. అదేవిధంగా ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌న్నారు. కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని… సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలని విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement