Sunday, May 5, 2024

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ పై ప్ర‌శంస‌లు.. దేశ గౌరవాన్ని పెంచారన్న ప్రధాని మోడీ

ఎన్నిక‌లు నిర్వ‌హించే సంప్ర‌దాయాన్ని అభివృద్ధి చేసి ప్ర‌పంచంలో మ‌న దేశ గౌర‌వాన్ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ పెంచింద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. నేడు ఆయ‌న గుజరాత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లో ఆయన ఓటు వేశారు. ఆ తర్వాత ఆయన పోలింగ్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న తన అన్న సోమా మోడి ఇంటికి వెళ్లారు. ప్రజాస్వామ్య పర్వదిన వేడుకలు చేసుకుంటున్న ఓటర్లకు, ఎన్నికల సంఘానికి ఆయన అభినందనలు తెలిపారు.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో ఈ ప్రజాస్వామ్య పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో నిర్వహించుకున్నారని ప్రధాని మోడీ అన్నారు.

ఈ ప్రజాస్వామ్య వేడుక జరుపుకుంటున్న దేశ ప్రజలను తాను అభినందిస్తున్నట్టు వివరించారు. ఎంతో ప్రభావవంతంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్‌కూ అతను కంగ్రాట్స్ చెప్పారు. గుజరాత్ ప్రజలు విచక్షణ కలిగినవారని అన్నారు. వారు అందరి మాటలూ వింటారని, ఏది నిజమో దాన్నే గ్రహిస్తారని వివరించారు. ఇక్కడి వాతావరణం చూస్తుంటే చాలా మంది ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు అర్థం అవుతున్నదని అన్నారు. గుజరాత్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ ఎన్నికల రెండో దశలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement