Thursday, May 2, 2024

విద్యార్థులపై జులం ప్రదర్శిస్తారా?: పయ్యావుల

అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. అనంత విద్యార్థులతో చెలగాటం ఆడొద్దని అన్నారు. అధికార మత్తులో విద్యార్థుల ఆందోళనలు భరించలేకపోతున్నారని పేర్కొన్నారు. ”విద్యార్థులపై జులం ప్రదర్శిస్తారా ? విద్యార్థీలనూ వదలారా? ” అంటూ మండిపడ్డారు. విద్యార్థులకు ఏమి రాజకీయాలు ఉంటాయని ప్రశ్నించారు. తమ భవిష్యుత్తు కోసం ఆందోళన పడుతున్నారని చెప్పారు. విద్యార్థులను లాఠీలతో చెదరగొట్టడం అమానుషం అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. అణచివేస్తే నేలకొరగడం ఖాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement