Friday, May 3, 2024

మ‌రీ ఇంత బూతులా.. దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారు.. సీఎం జ‌గ‌న్ స్పంద‌న‌

ఏపీ టీడీపీ నేత‌ల‌పై సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘జగనన్న తోడు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొంద‌రు మ‌రీ బూతులు మాట్లాడుతున్నారు.. ఇంత‌లా ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నార‌ని, దారుణ‌మైన భాష మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఎన్న‌డూ ఇట్లా మాట్లాడ‌లేద‌న్నారు.

తాము ఏపీలో అందిస్తున్న సంక్షేమ పాలనను చూసి తెలుగుదేశం నేత‌లు ఓర్వలేకపోతున్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. సచివాలయ, వ‌లంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి రాష్ట్రంలో కుల, మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

దీంతో ప్రతిపక్షం ఎలా తయారయిందో ప్రజలే గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతోందన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు కావాలనే వైషమ్యాలు సృష్టించి రెచ్చగొడుతున్నారని జ‌గ‌న్ ఆరోపించారు. ప్ర‌తిప‌క్ష నేత‌లు అసత్యాలు ప్రచారం చేస్తున్నార‌న్నారు.

వారి ప్రతిమాటలోనూ వంచన కనిపిస్తోందని, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ ఇదంతా చేస్తోంద‌న్నారు. కావాల‌నే తిట్టించి రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు. తాను ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశానని, ఇప్పుడు వారికి సాయం చేస్తున్నామ‌ని తెలిపారు.

వారికి ‘జగనన్న తోడు’ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10వేల వడ్డీలేని రుణం అందిస్తున్నామ‌న్నారు. ఇప్ప టివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశామ‌ని సీఎం వివ‌రించారు. ఏడాదిలో రెండుసార్లు ‘జగనన్న తోడు’ కార్యక్రమం ఉంటుంద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement