Monday, May 6, 2024

ఆనందయ్యకు అందరి మద్దతు ఉంది: సోమిరెడ్డి బహిరంగ లేఖ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్యను నిర్బంధించడం బాధాకరమని పేర్కొన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆనందయ్యను పోలీసులు మరో ప్రాంతానికి తరలించడం పట్ల బహిరంగ లేఖ రాశారు సోమిరెడ్డి. ఆనందయ్యను నిర్బంధించడం బాధాకరమని పేర్కొన్నారు. వంట చేసే సౌకర్యం ఉన్న భవనాల్లోనే ఆనందయ్యను నిర్బంధించడం వెనుక వారి ఉద్దేశం ఏమిటో అర్థమవుతోందని తెలిపారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, ఎమ్మెల్యేతోనే మాట్లాడుకోండనే స్థాయికి ఐజీ వచ్చారని సోమిరెడ్డి విమర్శించారు. ఆనందయ్యకు ఉపరాష్ట్రపతితో పాటు అన్ని పార్టీలు, నేతల మద్దతు ఉందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement